మన దేశ జనాబా లెక్కలు ? జనాబా పెరిగితే ఏంటి మనకొచ్చే నష్టం మీకు తెలుసా ? జనాబా నియంత్రించటం అవసరమా ? ఎందుకు ? 2011 జనాభా గణన మానవాళి చరిత్రలో అతిపెద్ద జనాభా గణన కానుంది.

భారత దేశము, చైనా  తరువాత ప్రపంచంలోని రెండో అత్యధిక జనాభా గల దేశం. ఎన్నో భిన్నత్వాలు గల జనాభా యొక్క సామాజిక, రాజకీయ వర్గీకరణలో భాష, మతం, కులం అనే మూడు ప్రముఖ పాత్ర వహిస్తాయి.  

ఒక జనాభాలో సభ్యుల గురించి సమాచారాన్ని క్రమపద్ధతిలో సేకరించే మరియు నమోదు చేసే ప్రక్రియను జనాభా గణన  అంటారు. ఇది ఒక నిర్దిష్ట జనాభాకు సంబంధించి జరిగే నియతకాలిక మరియు అధికారిక గణన.జాతీయ జనాభా మరియు గృహ గణనలకు సంబంధించి ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు; వ్యవసాయ, వ్యాపార మరియు ట్రాఫిక్ గణనలను ఇతర సాధారణ గణనలుగా చెప్పవచ్చు. ఇటువంటి గణనల్లో "జనాభా"కు సంబంధించిన అంశాలు ప్రజలకు బదులుగా మొక్కలు, వ్యాపారాలను సూచిస్తాయి. జనాభా మరియు గృహ గణనలకు సంబంధించిన ముఖ్యమైన లక్షణాలను ఐక్యరాజ్యసమితి "ఒక గుర్తించిన భూభాగంలో వ్యక్తిగత గణనం, సాధారణత, సమకాలికత్వం మరియు నిర్ణీత నియతకాలికత"గా గుర్తించింది, మరియు కనీసం 10 ఏళ్లకు ఒకసారి జనాభా గణనలు సేకరించాలని సిఫార్సు చేసింది.సెన్సస్ (జనాభా గణన) అనే పదాన్ని లాటిన్ నుంచి స్వీకరించారు: రోమన్ రిపబ్లిక్ సమయంలో జనాభా గణన అనేది సైనిక సేవలకు యోగ్యమైన యువకులను గుర్తించే ఒక జాబితాగా ఉండేది.
ప్రతిచయనానికి జనాభా గణన భిన్నంగా ఉంటుంది, ప్రతిచయనంలో సమాచారాన్ని ఒక జనాభా యొక్క ఉపసమితి నుంచి సేకరిస్తారు, కొన్నిసార్లు ఒక జనాభా అంతర అంచనాగా దీనిని సేకరించడం జరుగుతుంది. జనాభా గణన సమాచారాన్ని సాధారణంగా పరిశోధన, వ్యాపార మార్కెటింగ్ మరియు ప్రణాళికా రచనలతోపాటు ప్రతిచయన అధ్యయనాలకు ప్రాతిపదికగా ఉపయోగిస్తారు. 

2011 జనాభా గణన మానవాళి చరిత్రలో అతిపెద్ద జనాభా గణన కానుంది.భారతదేశంలో ఆధునిక కాలంలో మొట్టమొదటి జనాభా గణనను 1872లో నిర్వహించారు. మొదటి నియతకాలిక జనాభా గణనను 1881లో లార్డ్ రిప్పాన్ ప్రారంభించారు.అప్పటి నుంచి, జనాభా గణనను ప్రతి 10 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తున్నారు. తాజా జనాభా గణన మే 1, 2010న ప్రారంభమైంది. ఈ జనాభా గణనలో దేశంలో ప్రతి పౌరుడి ఛాయాచిత్రం మరియు వేలిముద్రలతో ఒక జాతీయ జనాభా రిజిస్టర్‌ను తయారు చేస్తారు. భారతీయ పౌరులందరికీ ఒక్కో విశేష గుర్తింపు (యునీక్ ID) సంఖ్యలు మరియు జాతీయ గుర్తింపు కార్డులు అందిస్తారు. జనాభా గణనను ఢిల్లీలోని రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా కార్యాలయం నిర్వహిస్తుంది, ఇది భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది, ఈ కార్యాలయాన్ని 1948 భారతదేశ జనాభా గణన చట్టం కింద ఏర్పాటు చేశారు. ఈ చట్టం కేంద్ర ప్రభుత్వానికి జనాభా గణనకు తేదీని నిర్ణయించే, జనాభా గణన పనికి ఏ పౌరుడి సేవలనైనా కోరే అధికారాలను కల్పించింది. అంతేకాకుండా ఈ చట్టం జనాభా గణనకు సంబంధించి ప్రశ్నలకు ప్రతి పౌరుడు నిజాయితీగా సమాధానం ఇవ్వడాన్ని తప్పనిసరి చేసింది. జనాభా గణన ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలకు తప్పుడు సమాధానాలు ఇచ్చినవారికి లేదా సమాధానాలు ఇవ్వనివారికి జరిమానాలు విధించే అధికారాన్ని ఈ చట్టం కల్పించింది. ఈ చట్టం యొక్క అత్యంత ముఖ్యమైన నిబంధనల్లో జనాభా గణన ద్వారా సేకరించిన ప్రతి వ్యక్తి సమాచారాన్ని గోప్యంగా ఉంచడం ఒకటి. జనాభా గణన పత్రాల్లో సమాచారాన్ని తనిఖీ చేయడం మరియు ఈ సమాచారాన్ని సాక్ష్యంగా స్వీకరించడం నిషేధించబడింది.
జనాభా గణనను రెండు దశల్లో నిర్వహిస్తారు: మొదటి దశలో, గృహాల నమోదు మరియు గృహాల సంఖ్యను గుర్తిస్తారు, రెండో దశలో అసలు జనాభా గణన జరుగుతుంది. జనాభా గణనను ప్రచార పద్ధతిలో నిర్వహిస్తారు. ఈ పద్ధతిలో, దేశంలోని ప్రతి ఇంటిని సంబంధిత సిబ్బంది సందర్శిస్తారు, ప్రత్యేకంగా శిక్షణ పొందిన పరిగణకులు సమాచారాన్ని సేకరిస్తారు. వారు గృహాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తారు, ఉదాహరణకు సభ్యుల సంఖ్య, నీరు మరియు విద్యుత్ సరఫరా, భూమి, వాహనాలు, కంప్యూటర్‌లు మరియు ఇతర ఆస్తులు మరియు సేవల వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని దీనిలో సేకరించడం జరుగుతుంది. రెండో దశలో, మొత్తం జనాభాను లెక్కిస్తారు మరియు వ్యక్తులకు సంబంధించిన గణాంకాలను సేకరిస్తారు.

గత దశాబ్దంతో పోల్చుకుంటే ఈ దశాబ్దంలో (2001-2011) దేశంలో జనాభా పెరుగుదల రేటు 2.5 శాతం తగ్గింది. తాజా జనగణన ప్రకారం 121.02 కోట్లతో చైనా తర్వాతి స్థానంలో భారత్‌ కొనసాగుతోంది. సంఖ్యపరంగా దేశంలో ఉత్తరప్రదేశ్‌ తొలిస్థానంలో ఉంటే, లక్షద్వీప్‌ చివరి స్థానంలో నిలిచింది. జనసాంద్రతలో (చదరపు కిలో మీటర్‌కు) 37,346 మందితో ఢిల్లీ ఈశాన్య జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఈ దశాబ్ద కాలంలో అక్షరాస్యత శాతం కొంతమేరకు పెరిగింది. పురుషుల్లో ఇది 75.26 నుండి 82.14 శాతానికి, మహిళల్లో 53.67 శాతం నుండి 65.46 శాతానికి ఎగబాకింది. 2001తో పోల్చుకుంటే అక్షరాస్యతలో స్త్రీ, పురుషుల మధ్య భేదం 21.59 నుండి 16.58 శాతానికి తగ్గింది. అక్షరాస్యత విషయంలో కేరళ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. 93.91 శాతంతో ఇది నెంబర్‌వన్‌ స్థానంలో ఉంది. జనాభాలో పురుష-స్త్రీ నిష్పత్తి మాత్రం 1000 : 940గా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జనాభా 8.46 కోట్లకు చేరింది.@ భారతీయులం  

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం