పొగత్రాగటం ఇప్పుడొక ఫ్యాషన్‌గా మారి పోయింది, రోడ్డు మీదకు వచ్చి చూస్తే నూటికి తొంభెై మంది మగవారి చేతుల్లో ఒక సిగరెట్టో.....ధూమపానం - దుష్ర్పభావాలు...పిల్లలపెై ప్రభావం...భారత దేశ నేపథ్యం...సిగరెట్‌ వల్ల కలిగే హానీ..

పొగత్రాగటం ఇప్పుడొక ఫ్యాషన్‌గా మారి పోయింది, రోడ్డు మీదకు వచ్చి చూస్తే నూటికి తొంభెై మంది మగవారి చేతుల్లో ఒక సిగరెట్టో, బీడీనో, లేక ఏదో ఒక పొగాకు ఉత్పత్తి చూడవచ్చు. కొన్ని అభివృద్ధి చెందిన నగరాలలో అయితే ఆడవారు కుడా ధూమ పానం చేస్తున్నారనుకోండి. రోజుకొకసారి ధూమపానం చేసేవారికి, వారి ఆయువు ప్రతి ఐదు సంవత్సరాలకి ఒక సంవత్సరం ఆయు వు తగ్గుతుందని, ప్రపంచ ఆరోగ్యసంస్థ ఎప్పు డో వెల్లడించిన సంగతి అందరికి తెలిసిందే. అయినా ఎవ్వరూ ధూమపానం మానకుండా, వారి ఆరోగ్యమే కాకుండా పక్కవారి ఆరోగ్యా న్ని కూడా నాశనం చేస్తున్నారు. ప్రపంచమం తా ఈరోజు పొగాకు వ్యతిరేకదినం అని తెలి సినా, మన వాళ్ళెవరికీ పట్టనట్లు గుప్పుగుప్పు మంటూ దమ్ము కొడుతున్నారు.

 ప్రభుత్వం బహి రంగ ప్రదేశాల్లో పొగాకు వాడకాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం 2002 సంవత్సరంలో ఓ చట్టాన్ని చేసింది. 'ఆంధ్రప్రదేశ్‌ ప్రొహిబిషన్‌ ఆఫ్‌ స్మో కింగ్‌ అండ్‌ హెల్‌‌త ప్రొటెక్షన్‌ యాక్ట్‌' కింద బ హిరంగ ప్రదేశాలు, ప్రజలు సాధారణంగా తిరిగే ప్రదేశాల్లో పొగతాగరాదు.

పొగాకు వ్యతిరేక దినం...
1987లో ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్యదేశా లు ప్రజలలో పొగాకు వినియోగం వల్ల కలిగే హాని పట్ల అవగాహన పెంచి, అప్రమత్తుల్ని చేసే లక్ష్యంతో ధూమపాన వ్యతిరేక దినోత్స వాన్ని పాటించాలని భావించాయి. తదనుగు ణంగా 1988 నుంచి ప్రతి సంవత్సరం మే 31న ఈ దినోత్సవాన్ని జరిపి ప్రజలకు పొగ త్రాగడం వలన వచ్చే అనారోగ్యం గురించి తెలియ జెప్పడమే ముఖ్య ఉద్దే్యశంగా పెట్టుకు న్నాయి. సమాజంలో స్వచ్ఛంద సంస్థలు, ప్ర భుత్వ ఉద్యోగ సంఘాలు, అన్ని పాఠశాలలు ఈ రోజు స్వచ్ఛందంగా ర్యాలీలు, సభలు, స మావేశాలు జరిపి ధూమపానం వలన జరిగే నష్టాలను ప్రజలకు తెలియజేస్తున్నాయి.

ధూమపానం - దుష్ర్పభావాలు...
మన దేశంలో సంవత్సరానికి దాదాపు 90 వేల మంది ప్రజలు పొగాకు వల్ల సంభవించే రోగాలతోనే మరణిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. పురుషులలో 56.4 శాతం, స్ర్తీలలో 44.9 శాతం కాన్సర్లకు కారణం పొ గాకు వాడకం వల్లే. ప్రపంచంలో ఎక్కడా లే నంత ఎక్కువగా గొంతు కాన్సర్‌ భారత దేశం లో వ్యాపిస్తోందనే ఆందోళన సర్వత్రా నెలకొంది. సిగరేట్‌ తాగగానే నికోటిన్‌, ఇతర రసాయ నాలు శరీరంలోకి వెళ్లి తీవ్ర ప్రభావాన్ని చూ పుతాయని నిపుణులు చెబుతున్నారు. ఒకసా రి సిగరెట్‌ తాగితే చాలా రకరకాల రసాయ నాలు శరీరంలోకి వెళ్తాయి. శరీంలోకి ప్రవే శించిన రసాయనాల్లో దాదాపు 40 నుండి 50 క్యాన్సర్లను కలిగించేవే. వాటితో పాటు తారు, కార్బన్‌ మోనాక్సైడ్‌ వంటివి శరీరం లోకి ప్రవేశిస్తాయి. మాములుగా ఊపిరి తి త్తుల్లో తమను తాము శుభ్రం చేసుకునే యం త్రాంగం ఉంటుంది. ఈ అలవాటు వలన అవి తమ సామార్థ్యాన్ని కోల్పోతాయి. ఆ కా లుష్యాన్ని బయటికి తీసుకురావడానికి పొడి దగ్గు మొదలవుతుంది.
                                 దీనినే స్మోకర్స్‌ కాఫ్‌ అని అంటారు. ప్రపం చంలో పొగాకు వాడకం వల్ల నోటి క్యాన్సర్‌ కేసుల సంఖ్య భారతదేశంలోనే ఎక్కువగా ఉన్నట్లు సర్వేలు వెల్లడించాయి. భారతదేశంలో పురుషుల్లో క్యాన్సర్‌ వ్యాధికి 56.4% కారణం కాగా మహిళల్లో 44.9% కారణమయ్యింది. ఊపిరితిత్తులకు వచ్చే క్యా న్సర్‌ 82%, ఇతర వ్యాధులకు 90% కార ణం పొగాకు వాడకం మాత్రమే. పొగాకు వా డకం గుండె రక్తనాళాల వ్యాధికి దారితీస్తుంది. ఇంకా గుండెపోటు, ఛాతిలో నొప్పి, హృద్రో గంతో ఆకస్మిక మరణం, మెదడుకు పక్షవా తం, నాడి సంబంధ వ్యాధులకు కూడ పోగా కు ద్రోహదం అవుతున్నట్లు తెలుస్తుంది.

పిల్లలపెై ప్రభావం...
సెకండ్‌ హ్యాండ్‌ స్మోకింగ్‌ కారణంగా పిల్లల్లో అస్తమా రోగుల సంఖ్య నానాటికి పెరుగు తోంది. ధూమాపానం ద్వారా వచ్చే పొగ వలన న్యుమోనియా లేదా శ్వాసతో పాటు వచ్చే దగ్గు (పల్మోనరీ బ్రాంకైటిస్‌) ఉత్పన్న మవుతుంది. పిల్లలో వినికిడి, వాచక సమ స్యలు తలెత్తుతాయి. ధూమాపానం చేసే వారి ఇండ్లలో పిల్లలకు ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతాయి. దీంతో వారిలో వ్యాధినిరోధక సమస్యలు ఉత్పన్న మవుతాయి. ఈ కారణం గా పిల్లలు యువావస్థలోకి వచ్చే ముందు ఇతరులకన్నా బలహీనంగా తయారవుతారు.
ప్రతి 8 సెకండ్లకు పొగాకు కారణంతో ఒక రు మృతి చెందుతున్నట్లు తెలుస్తుంది. అందు లో భాగంగా భారతదేశంలో పొగాకు వాడకం వల్ల మృతి చెందుతున్న వారి సంఖ్య ప్రతి ఏటా 8 నుంచి 9 లక్షల మధ్య ఉంటుంది. పురుషుల్లో నపుంసకత్వానికి కారణమవుతుం ది. అలాగే మహిళల్లో ఈస్ట్రోజోన్‌ హర్మోన్ల సంఖ్య తగ్గుతుంది. అరగంటసేపు పొగాకును నమిలితే 4 సిగరెట్లు తాగడంతో సమానమైన నికోటిన్‌ను మింగినట్లవుతుంది. పొగాకు నమిలేవారిలో నోరు, గొంతు క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఆరోగ్యవంతులకంటే 50 రెట్లు ఎక్కువగా ఉంటుందని వెైద్యులు చెబు తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలకు కారణమవుతున్న ప్రధాన 8 వ్యా ధులలో 6 వ్యాధులకు పొగాకు ఉమ్మడి రిస్క్‌ గా ఉంటుంది. మొత్తంగా 20వ దశాబ్దంలో 100 మిలియన్ల మరణాలు కేవలం పొగాకు సంబంధితంగా సంభవించినట్లు సర్వేలు తెలుపుతున్నాయి

భారత దేశ నేపథ్యం...
* మనదేశంలో సాలీనా 8 నుండి 9 లక్షల మరణాలు పొగాకు సంబంధమైనవిగా ఉంటున్నాయి.
* రోజూ 2200 మందికిపెైగా భారతీయులు పొగాకు వాడకం సంబంధిత మరణాలకు గురవుతున్నారు.
* రోజూ కొత్తగా 5500 మంది యువత పొగతాగేవారి జాబితాలో చేరుతున్నారు.
* ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో 
నోటి క్యాన్సర్‌ కేసులు భారతదేశంలో నమోదవు తున్నాయి. వీటిలో 90 శాతం పొగాకు వాడకం ఫలితంగా సంభవిస్తున్నాయి.
* భారతదేశంలో నమోదవుతున్న 
మొత్తం క్యాన్సర్‌ కేసుల్లో దాదాపు సగం కేసులు వివిధ రూపాల్లో పొగాకు వాడకం ఫలితంగా సంభవిస్తున్నవే.

సిగరెట్‌ వల్ల కలిగే హానీ..
1. ధూమపానం వల్ల శ్వాసనాళాలు దెబ్బతింటాయి.
2. శ్వాసనాళంపెై గోడలు గట్టిపడి వదిలే గాలిలోని మలినాలు బయటకు పోవడం తగ్గిపోతుంది.
3. సంకోచ, వ్యాకోచాలు తగ్గి క్రానిక్‌ బ్రాం కైటిస్‌, ఆఫ్‌స్లైక్టివ్‌ పల్మనరీ వ్యాధులు వస్తాయి.
4. కడుపులో ఉదరకోశ పొరలు దెబ్బతిని అల్సర్‌, గ్యాస్‌ ట్రబుల్‌, సమస్యలు తలెత్తుతాయి.
5. గుండెకు సంబంధించిన రక్తనాళాలు దెబ్బతిని బిపి, గుండెపోటు సంభవిస్తాయి.
6. మెదడులోని రక్తనాళాలు చిట్లి పక్షవా తం, నరాల బలహీనత ఏర్పడుతాయి.
7. ఆయాసం పెరిగి ఇసినోఫిలిస్‌, గ్యాలినోమా అనే వ్యాధికి దారితీస్తుంది.@ భారతీయులం 

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం